కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్‌పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు

  • అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఆసక్తికర సన్నివేశం
  • లాంజ్‌లో ఒకే టేబుల్‌పై కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంభాషణ
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు. మంగళవారం అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు వారు మాట్లాడుకున్నారు. రెండు గంటలకు పైగా వారి మధ్య సంభాషణలు జరగడం గమనార్హం. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.

KTR
KTR meeting
Komatireddy Raj Gopal Reddy
Payal Shankar
Telangana Politics
Telangana Budget Sessions

More Telugu News